ప్రజల మనసు గెలుచుకున్నాం.. బీజేపీ విజయం తథ్యం : మాధవీలత

-

తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఈనెల 25వ తేదీతో నామపత్రాల స్వీకరణకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు ఇవాళ పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమలం పార్టీ అభ్యర్థి మాధవీలత కూడా ఈరోజు నామినేషన్ వేయనున్నారు.

ఈ క్రమంలో ఆమె మొదట భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మోదీ పరివార్ విజయం ఎప్పుడో ఫిక్స్ అయిందని చెప్పారు. తాము ప్రజల మనసు గెలుచుకున్నామని.. అందుకే బీజేపీ విజయం తథ్యమని చెప్పారు. ఇక పాతబస్తీ నుంచి కలెక్టరేట్ వరకు మాధవీలత భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు రాష్ట్ర కీలక నేతలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news