నిమజ్జనం రోజు బందోబస్తులో 25 వేల మంది పోలీసులు..!

-

సెప్టెంబర్17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం.. ఇదొక్కటి కాదు చిన్న చిన్నవి నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్ లు అన్ని పరిశీలిస్తున్నారు. GHMC, కలెక్టర్ రోడ్డు రిపైర్స్, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు ,వైర్లు తొలిగించారు. నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.. పెండింగ్ పనులు అన్ని ఇవ్వల పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు అని పేర్కొన్నారు.

ఇందులో 15 వేలు సిటీ పోలీసులు, 10 వేల మంది డిజిపి,జిల్లాలనుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రైకమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వెహికిల్స్ ఏర్పాటు చేసాం. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం 1.30లోపు అవుతుంది. ఉదయం ఆరున్నార గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలిస్తాం అన్నారు. మండప నిర్వాహకులు రాత్రి అన్ని పూర్తిచేసుకుని ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం తరలిస్తారు. 70 అడుగుల విగ్రహము ఆరున్నార గంటలకు క్రెయిన్ పైకి తరలించనున్నారు. పోలీసులు, ghmc, రెవిన్యూ అధికారులు సమన్వయంతో కష్టపడి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా అయ్యేలా చేస్తారు అని సీపీ ఆనంద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news