హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి మెట్రో రైలు సమయం పొడిగింపు

-

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇంతకుముందు పలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రైలు సేవల వేళలు పొడిగించిన ఈ సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు సర్వీసులు ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలోనే సాధారణంగా రోజూ నడిచే సమయం కంటే.. ఇంకాస్త ఎక్కువ సేపు రైలు సేవలు  అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే ఇవాల్టి నుంచి మెట్రో సర్వీసులు అదనపు గంటల్లో పనిచేయనున్నాయి. అందుకు అనుగుణంగా మెట్రో రైలు వేళల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు టెర్మినల్​ స్టేషన్​ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. మరోవైపు ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. రోజురోజుకు మెట్రోలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news