హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సీఎం రేవంత్ మర్డర్ చేశారు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక సందర్భంలో వారిపై వీరు.. వీరిపై వారు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. నర్సాపూర్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సీఎం రేవంత్ మర్డర్ చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు తప్ప మరొకటి లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు 800 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది. సీఎం రేవంత్ తొమ్మిది నెలల పాలనలో రెండు నెలల పెన్షన్ మింగేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. పారిశుధ్య నిర్వహణ పడకేయడంతో జనాలు రోగుల బారిన పడుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version