నేను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు : కడియం శ్రీహరి

-

తాను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్  ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్  పార్టీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు మున్షీ తెలిపారు.

మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వరంగల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున కావ్య పోటీ చేయనని ప్రకటించింది. ఈ తరుణంలోనే కడియం శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ నేతలు కలవడం గమనార్హం. రేపు కే.కేశవరావు, మేయర్ విజయలక్ష్మీతో పాటు కడియం శ్రీహరి, కడియం కావ్యలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news