కాంగ్రెస్ నక్కను నమ్మితే నట్టేట ముంచడం ఖాయం : కేటీఆర్

-

కాంగ్రెస్ నక్కను నమ్మితే నట్టేట ముంచడం ఖాయమని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. 150 సంవత్సరాల ముసలి నక్క కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ పార్టీ గురించి ఓ ముసలవ్వ కథను చెప్పాడు కేటీఆర్. 

 

కాంగ్రెస్ మాటలకు విలువ ఉండదు అన్నారు కేటీఆర్. రాములు నాయక్ పార్టీలో నిబద్ధతతో పని చేశారని.. గతంలో ఓడిపోయిన వారికి కేసీఆర్ పిలిచి మంత్రి పదవీ ఇచ్చారని తెలిపారు. 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ..  ఆ పార్టీకి వారెంటీ అయిపోయింది. ఆ పార్టీకే వారెంటీ లేదు..  ఆ పార్టీ నాయకులకు గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని.. హైదరాబాద్ లో కమాండ్.. బెంగళూరు లో న్యూ కమాండ్.. ఢిల్లీలో హైకమాండ్.. ఇది కాంగ్రెస్ పరిస్థితి  అన్నారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. 3 గంటల విద్యుత్, ఏడాదికో ముఖ్యమంత్రి మారడం, రాష్ట్రంలో ఆడబిడ్డలు అవస్థలు పడుతారని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news