నకిరేకల్ కాంగ్రెస్ లో ముసలం..వేముల వీరేశంను పార్టీలో చేర్చుకోవద్దని ఆందోళన !

-

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. భువనగిరి లోక్ సభ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే మానే శ్రీనివాస్ సమక్షంలోనే నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళనకు దిగారు. అలాగే, పార్టీలో పనిచేస్తున్న నేతల్ని కాదని కొత్తవారికి టికెట్ ఇస్తే సహించబోమంటూ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

In Nakirekal Congress, Musalam
In Nakirekal Congress, Musalam

జెండాలు మోసిన వారిని పక్కనబెట్టడం సరికాదు…వీరేశం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో తమపై అక్రమ కేసులు పెట్టించాడని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కో సం ఎన్నో అవమానాలు, వేధింపులను భరించామని ఫైర్‌ అవుతున్నారు నకిరేకల్ నియోజక వర్గం కాంగ్రెస్ నేతలు. పదేళ్లుగా అధికార పార్టీతో పోరాడాం…ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే మా సత్తా ఏంటో చూయిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news