మోదీ సర్కారుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు

-

మోదీ సర్కార్ నిర్ణయాలను ప్రశంసించారు కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. శుక్రవారం ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని మాట్లాడుతూ.. జి-20 సదస్సుకు భారతదేశం నాయకత్వం వహించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. భారత విదేశాంగ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.

ఇతర దేశాల ఒత్తిడికి లొంగకుండా తటస్థ విధానం అనుసరిస్తూ మోడీ సర్కారు గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఇక జి-20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాకపోవడం దురదృష్టకరమన్న మహాన్మోహన్ సింగ్.. లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తత విషయంలో ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దేశ భూభాగాన్ని కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news