యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరు పోకిరీలపై కేసు నమోదు

-

రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి పట్ల ఇద్దరు ఆకతాయిలు అసభ్యకరంగా  ప్రవర్తించిన ఘటన మధురానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..మధురానగర్‌లోని లేడీస్‌ హాస్టల్‌లో నివాసం ఉండే ఓ యువతి తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో టీ తాగేందుకు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లారు.

యువతితో కలిసి టీ తాగిన తర్వాత నడుచుకుంటూ వస్తుండగా..మధురానగర్‌ ఇండోర్‌ స్టేడియం వద్దకు వచ్చేసరికి ఇద్దరు ఆకతాయిలు బైక్‌ పై వచ్చారు. యువతిని తాకరాని చోట్ల తాకి పైశా చికానందం పొందారు.పట్టుకునేందుకు ప్రయత్నిం చేలోపు బైక్‌ పై వేగంతో ఆ ఇద్దరు ఈవ్‌ టీజర్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news