Hyderabad : స్టీల్ బ్రిడ్జ్ కి నాయిని నర్సింహారెడ్డి పేరు

-

హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రారంభించబోతుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ అధికారిక ప్రకటన చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ను ఆగస్టు 19వ తేదీన ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.

2020 జులై 10న ఈ ఫ్లైఓర్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి.మొత్తం 2.63 కి.మీ పొడవైన స్టీల్ బ్రిడ్జి తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలో మీటర్ల దూరంలో 5 జంక్షన్లతో వాహనదారులు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు దాటి విద్యానగర్‌ వైపు వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version