ఇందిరమ్మ ఇళ్లు పథకం మార్గదర్శకాలు ఇవే

-

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈనెల 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు రూపొందించిన మార్గదర్శకాలు ఇవే.. 

  • లబ్ధిదారుడు విధిగా దారిద్య్రరేఖ(బీపీఎల్‌)కు దిగువన ఉన్న వారై ఉండాలి. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు.
  • లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
  • గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి.
  • గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులే.
  • అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
  • వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు.
  • ఒంటరి(సింగిల్‌ ఉమెన్‌), వితంతు(విడోవర్‌) మహిళలూ లబ్ధిదారులే.
  • ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
  • ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్‌ ఇంటిని మంజూరు చేస్తారు.
  • గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్‌ ఎంపిక చేస్తారు.
  • లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు.
  • జిల్లాల్లో కలెక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమిషనర్‌ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి.
  • లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు.
  • 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్‌, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్‌సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాలి.

Read more RELATED
Recommended to you

Latest news