రేవంత్, కవితకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలి – ఇంద్రసేనారెడ్డి

-

రేవంత్, కవితకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి. కేసిఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్ అని…పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్ట లేదన్నారు. పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలి….నీకు ( రేవంత్) కవిత కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు నల్లు ఇంద్రసేనారెడ్డి.

ఓటు కు నోట్ కేసులో రేవంత్ బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది ? మీకు బీ అర్ ఎస్ తో బిజినెస్ సంబంధాలు లేవా? అని నిలదీశారు. సీఎం కేసిఆర్ తో పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? అని ఫైర్‌ అయ్యారు. ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు…ఎన్నికల తర్వాత బీ అర్ ఎస్ కాంగ్రెస్ లు కలుస్తాయన్నారు నల్లు ఇంద్రసేనారెడ్డి. కలుస్తారు అని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ అని… బీజేపీ అభ్యర్థుల అప్లికేషన్ తేదీ పొడిగింపు పై ఎటువంటి చర్చ జరగలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version