ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

-

హైదరాబాద్ లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని జూన్ 14 శుక్రవారం నాడు బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న టిజిఎస్ ఆర్ టిసి బస్సు చక్రాల కింద పడి మరణించిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.

యూసుఫ్ గూడ బస్టాప్ లో ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆమె గమ్యం చేరుకునేందుకు వెళ్లాల్సిన బస్సు రావడంతో రన్నింగ్ లో ఉండగానే బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోవడంతో ఆమె పై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో అక్కడికక్కడే మరణించింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news