కాంగ్రెస్ ఎమ్మెల్యే అరాచకాలకు బీజేపీ కార్యకర్త బలి !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే అరాచకాలకు బీజేపీ కార్యకర్త బలి అయ్యాడు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు నర్వ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త మున్నూర్ శేఖర్ రెడ్డి. గతంలో నర్వ మండలంలో పని చేసి వెళ్లిన ఎస్ఐ విక్రమ్ ఇబ్బందులకు గురి చేశాడని అతనిని మళ్ళీ మండలానికి తీసుకురావొద్దని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కోరారు మున్నూర్ శేఖర్ రెడ్డి.

BJP worker victim of Congress MLA anarchy

దీంతో ఎమ్మెల్యే అనుచరుడు నర్వ పోలీస్ స్టేషన్లో కేస్ పెట్టడంతో నర్వ ఎస్ఐ కురుమయ్య, శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఎమ్మెల్యేతో పెట్టుకుంటావా.. నిన్ను లాకప్ డెత్ చేస్తాం అని బెదిరించాడు. దీంతో భయపడి శేఖర్ రెడ్డి పురుగుల మందు తాగాడు.. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news