దయచేసి రెడ్డి, రావుల ఓట్లు నాకు వేయకండి – తీన్మార్‌ మల్లన్న సంచలనం !

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మరో వివాదంలో చిక్కుకున్నారు. దయచేసి రెడ్డి, రావుల ఓట్లు నాకు వేయకండి అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసి నాకు రెడ్డోల్లు, ఓసీలు ఓట్లు వేయకండి మీ ఓట్లు నాకు అవసరం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మళ్లీ తాను పోటీ చేస్తే.. ఓటే వేయకూడదని కోరారు.

teenmar mallanna

నాకు బీసీల ఓట్లు సరిపోతాయని.. వాళ్లు ఓటు వేయగా.. మిగులుతాయని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పై రెడ్డి నేతలు సీరియస్‌ అవుతున్నారు. ఈ తరుణంలోనే.. తీన్మార్ మల్లన్న పై రెడ్డి జాగృతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీన్మార్ మల్లన్న పై పోలీసులకు ఫిర్యాదు చేసింది రెడ్డి జాగృతి.

Read more RELATED
Recommended to you

Latest news