BREAKING : BRSలో చేరిన జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్‌

-

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌లో జడ్చర్ల కాంగ్రెస్ మాజీ నేత ఎర్ర శేఖర్‌ చేరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు ఎర్ర శేఖర్‌. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి… బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి ఎర్ర శేఖర్‌ ను స్వాగతం పలికారు మంత్రి కేటీఆర్.

Jadcharla Congress leader Erra Shekhar has joined BRS

ఇది ఇలా ఉండగా జడ్చర్ల నుండి రెబల్గా పోటీ చేస్తానని నిన్న ఎర్ర శేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవటంతో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సర్వేల ద్వారా టికెట్ కేటాయించలేదని.. కార్యకర్తల అభీష్టం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 9న జడ్చర్ల నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, అనూహ్యంగా బీఆర్‌ఎస్‌లో జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్‌ చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version