జగన్.. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి పాలించినా ఇంత కుట్ర చేయలేదు : మోత్కుపల్లి

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని నిరసిస్తూ.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. దసరా వేడుకలకు ఆయన దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ.. ముఖ్యంగా టీడీపీ అధినేతను చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారు. జైల్లో కిరాతకులు ఉండాలి ప్రజల కోసము జీవితాన్ని అంకితం చేసిన వాళ్లు కాదు.. జగన్.. మీరు జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు ఆయనను మానసికక్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లి పోతున్నారు.

చంద్రబాబుకు పేలు రాకుండా కుట్ర చేస్తున్నారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా రాజధాని లేని రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. జగన్.. ఇక మీ ఆటలు సాగవు మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరు. మీ నాన్న పాలించిన ఇంత కుట్ర చేయలేదు. నేను కడుపు మండి మాట్లాడుతున్నానని.. ప్రజలు జగన్ ఆట కట్టిస్తారు డాక్టర్ సుధాకర్ ని చంపిన పాపం జగన్ ది వీర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news