జగన్ పులి కాదు.. పిల్లి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పులికాదు.. బీజేపీ ముంగిట పిల్లిలా మారారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బీజేపీ గుప్పిట్లో జగన్ చిక్కుకున్నారు. ప్రత్యేకహోదా కోసం ఆయన ఎప్పుడైనా నిజమైన పోరాటం చేశారా..? 25వేల పోస్టులతో డీఎస్సీ అన్నారు. ఇప్పుడు తూతూ మంత్రంగా ఎన్నికల ముగింట డీఎస్సీ ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని సాధ్యం అని ఆమె పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీలోకి ఎలా వెళ్లావని అడుగుతున్నారు. జగన్ అన్నా.. నేను ఒక్క మాట అడుగుతున్నా చెప్పు చెప్పు అని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారని.. ఆయనకు కాంగ్రెస్ రెండు సార్లు సీఎం అయ్యే అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని అనుకున్నామని. అదంతా అబద్దమని నేను, నా మనసు నమ్ముతున్నాం కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news