జనగామ జిల్లా బీజేపీ నేత కిడ్నాప్ కలకలం

-

 

జనగామ జిల్లా బీజేపీ నేత కిడ్నాప్ కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి మిస్‌ అయ్యారు. హైదరాబాద్ లోని అల్వాల్ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఇదే సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారింది.

కొందరు వ్యక్తులు తన భూమిని అక్రమంగా కబ్జా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి. సబ్ రిజిస్ట్రార్ లో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కొంతమంది వ్యక్తుల తప్పుడు రిజిస్ట్రేషన్లపై పోరాడుతున్నాడు తిరుపతి రెడ్డి. ఇలాంటి తరుణంలోనే.. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి మిస్‌ అయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని భార్య సుజాత. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news