జనగాం బీఆర్ఎస్ పార్టీలో ముసలం..ప్రగతి భవన్ కు పంచాయితీ !

-

జనగాం బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. బీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డికి కుంపటి పెడుతున్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ముత్తి రెడ్డికి తెలియకుండా జనగాం బీఆర్ఎస్ పార్టీ నాయకులను హైదరాబాద్‌లో టూరిజం ప్లాజాకు పిలిపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఈ తరుణంలోనే.. ప్రగతి భవన్‌ పక్కనే ఉన్న టూరిజం ప్లాజాలో ప్రత్యక్షమైన ముత్తి రెడ్డిని చూసి బీఆర్ఎస్ నాయకులు షాక్ అయ్యారు. ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చానని.. పార్టీ అధిష్టానం ఇలాంటి చర్యలు క్షమించదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తి రెడ్డి హెచ్చరించారు. ఇక ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లారు ముత్తిరెడ్డి. మరి ఈ విషయంపై సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news