జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం – టీపీసిసి చీఫ్ మహేష్ కుమార్

-

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు జీవన్ రెడ్డి.

బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హై కమాండ్ కి చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మరదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

జీవన్ రెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగతమని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవలసిన అవసరం ఉందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం అని చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని అన్నారు. దీనివల్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎక్కడ భంగం వాటిల్లలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version