వదలిపెట్టేది లేదు…ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తాం – జేపీ నడ్డా

-

 

JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాల్లో…బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సంచలన ప్రకటన చేశారు. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. కొన్ని సార్లు ఓటమిలో కూడా గెలుపు ఉంటుంది….తెలంగాణ లో ఆ మేరకు విజయం సాధించామన్నారు. గతంలో తెలంగాణ లో బిజేపి కి ఒక శాసనసభ్యుడే ఉన్నాడు…..బిజేపి ఓటు శాతం అప్పుడు 7.1 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారని గుర్తు చేశారు.

jp nadda key statement on telangana

తెలంగాణలో ఈ సారి వదలిపెట్టేది లేదు…తెలంగాణలో కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు సన్నద్దమవుతున్నామని…మోడి నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు వస్తున్నాయని వివరించారు. అలాగే, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలంతా ఎంతో శ్రమించి బిజేపి కి ఓట్లు వచ్చేలా కృషి చేశారని… శ్రమించి పనిచేసిన కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలిపారు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా.

Read more RELATED
Recommended to you

Latest news