నీ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునేలా నేను మాట్లాడుతా – కడియం శ్రీహరి

-

ఎమ్మెల్యే రాజయ్య కు వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఎమ్మెల్యే రాజయ్య తన తల్లిని అవమానించిన తీరుకు భావోద్వేగానికి గురయ్యారు కడియం శ్రీహరి. రాజకీయాల కోసం 93 ఏళ్ళ తన తల్లి గురించి కూడా అంత నీచంగా మాట్లాడటం అవసరమా అని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నా తల్లి బీసీ, తండ్రి ఎస్సీ. తండ్రి కులమే పిల్లలకు వస్తుందన్నారు.

తల్లి నిజం.. తండ్రి ఊహ అనడం దారుణమని వెల్లడించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నా దగ్గరున్న సమాచారం ప్రకారం నీ కుటుంబం గురించి మాట్లాడితే నీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ప్రజలతో మంచి అనిపించుకుని మళ్ళీ కేసీఆర్ దగ్గర టికెట్ తెచ్చుకో నేను వద్దు అనట్లేదు కదా అని నిలదీశారు. రాజకీయాలను రాజకీయంగా చేద్దాం, కుటుంబాలను ఇందులోకి లాగొద్దని కోరారు కడియం శ్రీహరి. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news