కాలే యాదయ్య. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం !

-

Kale Yadayah Argument between MLC Mahender Reddy: వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పీకర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

Kale Yadayah Argument between MLC Mahender Reddy

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం రూ.10కోట్లు ఇస్తున్నట్లు కాగితం మాత్రమే ఇచ్చింది అన్నారు. అయినా ఈ బిల్డింగ్ కాంట్రాక్టు మీరే నిధులు, మీకే వస్తాయంటూ మహేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలగజేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మహేందర్ రెడ్డి కాలే యాదయ్యను ప్రశ్నించగా ఏ మాట్లాడోద్ధా‌ అంటూ యాదయ్య నిలదీశారు. దీంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పీకర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version