ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. రేపు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాల రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ ద్వారా పరీక్ష ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే.

సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఇంటర్ బోర్డు అతి తక్కువ సమయంలోనే ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి పరీక్ష ఫలితాలను తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. కాగా, ఇంటర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ కాగా, 7వ తేదీన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలవడనున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.