ఇవాళ తిరుమలకు కల్వకుంట్ల కుటుంబం ?

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాదు నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల ప్రయాణం అవుతారు.

 Kalvakuntla family going to Tirumala today
Kalvakuntla family going to Tirumala today

తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టీటీడీ అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, ఆమె ఒంటరిగా శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో… శోభ తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి రావడం అందరి దృష్టి కెసిఆర్ ఆరోగ్యంపై పడింది.

Read more RELATED
Recommended to you

Latest news