ఎమ్మెల్సీ కవిత గత కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కేసీఆర్ కు రాసిన లేఖ పెద్ద వివాదంగా మారింది. తన తండ్రికి ఇలా బహిరంగంగా లేఖ రాయడంతో రాజకీయాల్లో ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే కవిత తన రాజకీయ కార్యాచరణపై కీలక ముందడుగులు వేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.

కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ కు వ్యతిరేకంగా నోటీసులు ఇవ్వడంపై నిరసన తెలపనున్నారు. జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతున్నారు. ఈ విషయం పైన ఈరోజు సాయంత్రం వరకు మరింత క్లారిటీ రానుంది.