కొత్త పార్టీ పెట్టడంపై కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కు ఒక కన్ను గులాబీ పార్టీ అయితే, రెండో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకు వెళుతుందని చెప్పారు కవిత.

తెలంగాణ జాగృతి కేసీఆర్, ప్రొ. జయశంకర్ స్పూర్తితోనే ఏర్పాటు చేశామని వివరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కవిత.