బీజేపీ పోరాటం వ‌ల్లే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తుండు : బండి సంజ‌య్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌కట‌న పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ స్పందించారు. బీజేపీ పోరాటం వ‌ల్లే కేసీఆర్ వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుండ‌ని అన్నారు. బీజేపీ నాయ‌కుల పోరాటంతో సీఎం కేసీఆర్ మెడ‌లు వంచామ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే వ‌రి ధాన్యం రాష్ట్ర ప్ర‌భుత్వం తోనే కొనుగోలు చేయిస్తామ‌ని చెప్పామ‌ని గుర్తు చూశారు.

చేసి చూపించామ‌ని అన్నారు. వ‌రి వేసతే ఉరి అని చెప్పన సీఎం కేసీఆర్ నొటి నుంచే.. వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించేలా చేశామ‌ని అన్నారు. బీజేపీ పొగ పెట్టడం వ‌ల్లే కేసీఆర్ దిగివ‌చ్చాడ‌ని అన్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌నే భ‌యంతోనే ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 97 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందని తెలిపారు. రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడు ముందు ఉంటుంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news