KCR: ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

-

ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో పంటలను పరిశీలించనున్నారు కేసీఆర్. అనంతరం పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్న కేసీఆర్…మరోసారి ప్రెస్‌ మీట్‌ పెడతారు. కాగా, కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు.

KCR Goes To People, Old Problems Continue

కొత్తగా వచ్చే పంటకు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ డిమాండ్ చేశారు. ‘ఏప్రిల్ 2న దీనిపై బీఆర్ఎస్ నేతలు అధికారులకు మెమోరాండాలు ఇస్తారు. ఏప్రిల్ 6న బోనస్ కోసం దీక్షలు చేస్తాం అని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం అని పిలుపునిచ్చారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని చెబుతాం. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version