రైతు బంధు పై కెసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం..

-

తెలంగాణలో రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన పథకం రైతుబంధు..పథకం కింద రైతులకు కొంత నగదు అందుతున్న విషయం తెలిసిందే..ఈ ఏడాది కూడా రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది కెసీఆర్ సర్కారు.. అయితే ఈ సారి భూములు కలిగిన వారికి భారీ షాక్ ఇవ్వనుంది.వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది.వాణిజ్య లావాదేవీలు, ఇతరత్రా అవసరాలకు వాడే భూములకు వ్యవసాయ పట్టా ఉంటే రైతుబంధును నిలిపేయాలని ఆలోచిస్తోంది.. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది.

ఇకపోతే రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. ముందు ఓ సీజన్‌కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్‌కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021-22 వ్యవసాయ సీజన్‌లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది.

పంట పండించే రైతులకు కాకుండా పట్టా ఉండి, వేరే పనులు చెయిస్తున్న భూములకు ఇవ్వడం తగదని, సర్కారు సర్వే నిర్వహిస్తుంది.రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్‌ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు..విత్తు వెసెందుకు సీజన్ వచ్చింది. మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటూందో అని రైతులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version