కేసీఆర్ జూట, మోడీ జూట.. దోనో మిల్కే దేశ్కో లూటా – మధుయాష్కి గౌడ్

-

బీఆర్ఎస్ – బిజెపి పార్టీలు రెండు ఒకటేనని ఆరోపించారు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్. బిఆర్ఎస్ – బిజెపిని తెలంగాణ ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ వరంగల్ లో పాత చింతకాయ పచ్చడిలా మాట్లాడారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జూట, మోడీ జూట.. దోనో మిల్కే దేశ్కో లూటా అంటూ సెటైర్లు వేశారు. బిజెపి తెచ్చిన ప్రతి బిల్లుకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని అన్నారు మధుయాష్కి గౌడ్.

రాష్ట్రంలో కెసిఆర్ అవినీతి చేశారని ఆరోపిస్తున్న ప్రధాని మోదీ ఆయన అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడంలో బీజేపీ – బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావద్దనే కుట్రతోనే ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేం చేసినా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news