రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై కమిషన్ వేశారు : కేసీఆర్

-

రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై కమిషన్ వేశారు అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చ జరిగింది.

kcr
kcr

కాళేశ్వరంపై NDSA ఇచ్చిన రిపోర్టును నిర్మాణ సంస్థ L&T తప్పు పట్టడంపై చర్చించారు నేతలు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సంస్థ లేఖతో NDSA నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పొర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు…. వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news