బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్ రెడ్డి రియాక్షన్

-

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేంద్రమంతి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర అంటూ.. కవిత కామెంట్స్ కు కిషన్ రెడ్డి రియాక్టు అయ్యారు. అది తండ్రి-బిడ్డ, అన్న-చెల్లెలు సమస్య అన్నారు. ఆ ఫ్యామిలీ డ్రామాలో మేం పాత్రదారులం, సూత్రధారులం కాదల్చుకోలేదని పేర్కొన్నారు కేంద్రమంతి కిషన్ రెడ్డి.

kishan Reddy
kishan Reddy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరిచో చర్చలు జరిగాయో కేసీఆర్ ను కవితే అడగాలన్నారు. కవిత ఎసిసోడ్ పై బీజేపీ, తెలంగాణ ప్రజలు స్పందించబోదని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఇక అటు బీజేపీలో విలీనం కాదు.. పొత్తు కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్‌ను ప్రశ్నిస్తే నష్టపోతారని కవితకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news