కెసిఆర్ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు తెలపాలి: బండి సంజయ్

-

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే కెటిఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వస్తుంటే కెసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లాడని, అసలు కెసిఆర్ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

సమతా మూర్తి కి నేనే ఖర్చు పెడుతున్నా అంటివి.. ప్రధానమంత్రి వస్తే కలవకపోతివి అంటూ ఎద్దేవా చేశారు. దళిత బంధు ఇస్తా అన్నావు, అంబేద్కర్ విగ్రహం పెడతా అన్నావు, తెలంగాణ ప్రజలు కష్టార్జితాన్ని తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నావు అంటూ మండిపడ్డారు.ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందడం లేదని, కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించ లేదు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Latest news