అన్నారం బ్యారేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదు : EE యాదగిరి

-

అన్నారం బ్యారేజిపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అన్నారం బ్యారేజ్ కి సంబంధించిన ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ ఏ. యాదగిరి మీడియాకు వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ బ్యారేజ్ కి బ్యారేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదు. అన్నారం బ్యారేజ్ కు ఢోకా లేదన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రతి సంవత్సరం సహజంగా ఓ అండ్ ఎంటెక్ అప్డేట్ చేస్తాం.1275 మీటర్స్ లెంగ్త్ లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదని తెలిపారు.

ఇరిగేషన్ శాఖ మరియు ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత వాళ్లదేనని తెలిపారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నాం. సాండ్ తోని రింగ్ బండ్ కూడా వేస్తున్నాం.ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుంది.ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపెజ్ వాటర్ అలో చేసేందుకు డిజైన్లోనే ఆరెంజ్మెంట్ ఉంటుంది. అవసరం అయితే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తామని తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.యాదగిరి.

Read more RELATED
Recommended to you

Latest news