జైనూర్ ఘటనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసి మహిళపై ఆగస్టు 31వ తేదీన అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే జైనూర్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.

Key statement of KTR on Zainur incident

” కొమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల “పరిహారం” ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.

జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్త్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలి. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి” అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news