ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు ప్రభాకర్ రావు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు ప్రభాకర్ రావు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు ప్రభాకర్ రావు.

వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు రానున్నారు ప్రభాకర్ రావు. పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 14 నెలలుగా అమెరికాలోనే తల దాచుకున్న ప్రభాకర్ రావు… సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు ప్రభాకర్ రావు.