తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. నడక దారిన వెళ్లే భక్తులకు జాగ్రత్తగా ఉండాలని తిరుమల అధికారులు సూచనలు చేస్తున్నారు మెట్ల మార్గంలోని 500వ మెట్టు వద్ద చెట్ల పొదల్లో చిరుతను భక్తులు గమనించి కేకలు వేశారు అనంతరం సెక్యూరిటీ కి సమాచారం అందించగా అక్కడికి సిబ్బంది చేరుకొని సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు.

కొద్దిరోజుల క్రితం ఘాటు రోడ్డు పిట్టగోడపై చిరుత పరుగులు పెట్టిన విషయం తెలిసిందే గతంలోనూ చిరుత ఓ బాలుడిని అతి కిరాతకంగా చంపింది. అప్పటినుంచి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తిరుమల వద్ద భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి షీలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్ లలో దర్శనం కోసం వేచి ఉన్నారు దాదాపు తిరుమల భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైనే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.