హైదరాబాద్ లో కిడ్నాప్ గురైన 9 నెలల పాప సురక్షితం

-

 

హైదరాబాద్ కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్ మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ అయింది. నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో పాపను కిడ్నాప్ చేసింది పని పనిషి. దీంతో మాధన్నపేట్ పీఎస్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు ప్రారంభించింది. అయితే..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని మాదన్నపేటలో కిడ్నాప్ గురైన 9 నెలల పాప సురక్షితం అని పోలీసులు ప్రకటించారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్ లో జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు….జహీరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. జహీరాబాద్ లో బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు జహీరాబాద్ పోలీసులు.

జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు కొద్దిసేపటి క్రితమే చేరారు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు. ఇక కుటుంబసభ్యులకు చిన్నారిని అప్పగించి జహీరాబాద్ నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు మదన్నపేట్ పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ఎంజీబీఎస్ లో కిడ్నాప్ చేసిన మహిళ జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితమే కిడ్నాప్ కు గురైన చిన్నారి ఇంట్లో పని మనిషిగా చేరింది మహిళ సహనాజ్‌ఖాన్‌. ఇక ఆమెను అరెస్ట్‌ చేసి, విచారణ చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news