సీఎం రేవంత్‌ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : కిషన్ రెడ్డి

-

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము రెండంకెల స్థానాలు సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ పార్టీకి ఇంత సానుకూలమైన ఎన్నికలను గతంలో తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాటిపై కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు.

ఎన్నికల్లో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, నిందలు వేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సాధారణమైపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో సుస్థిర పాలన, స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతో దేశం, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రజలు కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ‘మరోసారి మోదీ’ అనేది జన నినాదంగా మారిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, ఇష్టం లేకపోయినా అప్పుడు ఆ పార్టీని గెలిపించారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version