కరీంనగర్ లో విపరీతంగా డబ్బులు పంచుతున్నారు – కిషన్ రెడ్డి

-

కరీంనగర్ లో విపరీతంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. ఓటర్లను భయపెట్టి…ప్రలోభాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ గురి చేస్తుందన్నారు. డబ్బులకు, ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని కోరారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. ఇవాళ హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి.

kishan reddy

ఈ సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ…ముధోల్ బీజేపీ పార్టీ అభ్యర్థి పై దాడి చేసారని ఫైర్ అయ్యారు. రేపు తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి అని చెప్పారు. ఇప్పటికే 4 రాష్టాల ఎన్నికలు ముగిశాయని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. అందరూ రాజ్యాంగం కల్పించిన ఓటును సద్వినియోగం చేసుకోవాలి.. డబ్బులకు, ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దు అని స్పష్టం చేశారు కిషన్‌ రెడ్డి. తెలంగాణను ఎవరు ఇవ్వలేదని.. ప్రజలే తెలంగాణను సాధించుకున్నారని కిషన్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news