బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేంద్రమంతి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర అంటూ.. కవిత కామెంట్స్ కు కిషన్ రెడ్డి రియాక్టు అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘కాంగ్రెస్ లో కవిత చేరికపై బీఆర్ఎస్ ఎందుకు అధికారికంగా స్పందించలేదు. ఆమెకు మంత్రి పదవి ఖాయమైందని, ఏ శాఖ ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కవిత ఎపిసోడ్ పై బీజేపీ నేతలెవ్వరూ స్పందించవద్దు’ అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరిచో చర్చలు జరిగాయో కేసీఆర్ ను కవితే అడగాలన్నారు.
కవిత ఎసిసోడ్ పై బీజేపీ, తెలంగాణ ప్రజలు స్పందించబోదని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఇక అటు బీజేపీలో విలీనం కాదు.. పొత్తు కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ను ప్రశ్నిస్తే నష్టపోతారని కవితకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.