మోదీ సభ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందు ఉంది : కిషన్ రెడ్డి

-

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభపై బీఆర్ఎస్ విమర్శలపై.. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి మోదీ సభకు వచ్చిన అద్భుత ప్రజా స్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందన్న ఆయన…ఇదీ కేవలం చిన్న ట్రైలర్ మాత్రమే అని….దీనికే గజగజ వణికిపోతుంటే… రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితేంటో అని ఏద్దేవా చేశారు. ప్రధాని అన్నది ఫాంహౌజ్ కుటుంబాన్ని… అది అర్థం కాన్నట్లు కేటీఆర్ నటించడం నవ్వు తెప్పిస్తోందన్నారు.

కేసీఆర్ తెలంగాణకు కుటుంబ పెద్దేయితే… దళితులను ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయాలేదని నిలదీశారు. పోడు భూములకు పట్టాలిస్తనని చెప్పి.. అడవి బిడ్డలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. సాకులు చూపి నియామకాలు చేపట్టక, నిరుద్యోగులను నిలువునా వంచిశారన్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఆస్పత్రి పాలవుతుంటే… పిల్లల యోగక్షేమాలు ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. నిత్యం ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news