తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు..మావోయిస్టులకు సాయం చేస్తున్నారని !

-

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారుల దాడులు కలకలం రేపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారుల దాడులు కలకలం రేపాయి. హైదరాబాద్‌తో పాటు ఏపీలో ఆరు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు.

NIA raids in Telugu states
NIA raids in Telugu states

హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, నెల్లూరులలో ఏ కాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు… హైదరాబాదులో భవాని, అడ్వకేట్ సురేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆల్వాల్ లోని సుభాష్ నగర్ లో బంధుమిత్రుల సంఘం సభ్యులు ఇళ్లపై ఎన్ఐఏ దాడులు జరుగుతున్నాయి. నెల్లూరులో పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు చేశారు. తిరుపతిలో క్రాంతి చైతన్య ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. పొన్నూరులో రాజారావుని విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు…చీమకుర్తిలో దుడ్డు వెంకటరావు ఇంట్లో దాడులు చేశారు. మావోయిస్టు సానుభూతి పరులని ఆరోపణలు వచ్చిన తరుణంలోనే ఈ దాడులు చేస్తోంది ఎన్‌ఐఏ.

 

Read more RELATED
Recommended to you

Latest news