ఓవైసీ బద్రర్స్‌ ను ఎవరు చంపరు.. వారికి వారే సమాధి అవుతారు – కిషన్‌రెడ్డి

-

ఓవైసీ బద్రర్స్‌ ను ఎవరు చంపరు.. వారికి వారే రాజకీయంగా సమాధి అవుతారన్నారు కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించారు కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అక్బరుద్దీన్ ని ఎవరు చంపాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అక్బరుద్దీన్ ను ఎవరు జైల్లో పెట్టాలనుకుంటున్నారో రేవంత్ చెప్పాలి..అక్బరుద్దీన్ ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో మజ్లీస్ ప్రజల మద్దతును కోల్పోతుందని… అక్బరుద్దీన్ ను ఎవరు చంపరు.. వారికి వారే రాజకీయంగా సమాధి అవుతారని తెలిపారు. త్వరలోనే ప్రజలు మజ్లీస్ ను రాజకీయ సమాధి చేస్తారు..అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం కొన్ని ఓట్ల తేడాతోనే గెలిచారు….రిగ్గింగ్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిందని వెల్లడించారు కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news