రాజీనామాకు సిద్ధం.. కేటీఆర్ కి సవాల్ విసిరిన కోమటిరెడ్డి

-

యాదాద్రి జిల్లా: నేడు భువనగిరి మండలం బండ సోమరం విద్యుత్ సబ్ స్టేషన్ ని సందర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సబ్ స్టేషన్ కరెంట్ సప్లై రిజిస్టర్ తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్ తో మాట్లాడారు కోమటిరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు అనేది పచ్చి అబద్ధమని ఆరోపించారు. 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు.

అందులో కూడా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉద్యోగులందరూ కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. సరైన సమయానికి జీతాలు రాక, ఈఎంఐలు కట్టక ఉద్యోగస్తులు అప్పుల బారిన పడుతున్నారని అన్నారు. 11 గంటలకంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధం అంటూ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news