ED చీఫ్‌గా బండి సంజయ్‌ – మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

-

ED చీఫ్‌గా బండి సంజయ్‌ ని నియమించినందుకు తెలంగాణ మంత్రి వర్యులు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

” ప్రియమైన @PMOIndia. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ని కూడా ED చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు 👏👏ఈ దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్ నిజానికి “మోడీ & ఈడీ” అని ఇప్పుడు మేము గ్రహించాము.” అంటూ కేంద్ర బీజేపీ నాయకత్వానికి అలాగే బండి సంజయ్‌ కుమార్‌ కు చురకలు అంటించారు మంత్రి కేటీఆర్‌.

కాగా.. నిన్న వేములవాడ లో పర్యటించిన బండి సంజయ్‌… కేసీఆర్‌ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సిందేనని..కేసీఆర్‌ కు బండి సంజయ్‌ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ నువు జాగ్రత్త.. రూ. 800 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకొని జల్సాలు చేస్తున్నావని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version