ప్రజలకు మంచి చేశాం.. ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది : కేటీఆర్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ జోరు సాగిస్తున్నారు. బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు, బూత్ లెవల్ కమిటీ మీటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఈ నెల 17వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రోజుకు రెండు నియోజకవర్గాల్లో రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ సనత్ నగర్ లో బూత్ లెవల్ కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేశామని.. తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సనత్ నగర్ లో చేసిన అభివృద్ధి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయని.. ప్రజలు దీన్ని గమనించి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తామెప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయడానికి మరో అవకాశం ఇవ్వాలని ఊ సందర్భంగా కేటీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news