కేటీఆర్ నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.. జైలు నుండి మరో లేఖ విడుదల చేసిన సుఖేష్

-

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి మండొలీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కేసీఆర్ ఫ్యామిలీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో కేవలం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై కీలక ఆరోపణలు చేస్తూ జైలు నుంచి లేఖలు విడుదల చేసిన సుఖేష్.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేశారు. తాజాగా జైలు నుండి మరో లేఖ విడుదల చేశారు సుఖేష్.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశారు. మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసుల పేరుతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని.. కేటీఆర్, కవితలపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. తాను ఇప్పటివరకు రాసిన లేఖలు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వెంటనే సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సుకేష్ చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news